Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఐఎస్‌సి ఉగ్రవాద దాడి కేసు: ఆరుగురికి జీవితఖైదు

Advertiesment
బెంగళూర్
2005వ సంవత్సరం కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని ఇండియన్ సైన్స్ సంస్థ (ఐఐఎస్‌సి)పై జరిగిన ఉగ్రవాద దాడి కేసులో ఆరుగురికి జీవిత ఖైదు పడింది. ఐఐఎస్‌సిపై 2005లో జరిగిన దాడి కేసులో ఆరుగురిని స్థానిక కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ తీర్పును శనివారం వెలువరించింది. ఇందులో భాగంగా ఆరుగురికి జీవిత ఖైదును ఖరారు చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

అయితే కుట్ర అభియోగం మోపిన మరో వ్యక్తిని మాత్రం నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. అంతేగాకుండా ఈ ఆరుగురికి ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు అనుమానిస్తారు. కాగా మొహమ్మద్ రజా - ఉల్ - రెహ్మాన్, అఫ్జల్ పాషా, మెహబూబ్ ఇబ్రహీం, మిరుద్దీన్ ఖాన్, నిజాముద్దీన్, మున్నాలకు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu