Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధుమేహ వ్యాధికి ఎండోబారియర్‌తో చెక్: బ్రిటన్ శాస్త్రవేత్తలు

మధుమేహ వ్యాధికి ఎండోబారియర్‌తో చెక్: బ్రిటన్ శాస్త్రవేత్తలు
FILE
చిన్నపిల్లల నుంచి వృద్ధులను సైతం వణికిస్తున్న మధుమేహ వ్యాధిని అరికట్టేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు సరికొత్త పరికరాన్ని కనిపెట్టారు. దీనిని ఎండోబారియర్ అంటారని, దీనికి నోటి ద్వారా ఆంత్రమూలంలోకి ప్రవేశపట్టవచ్చునని తెలిసింది. దీంతో కొన్ని వారాల్లోనే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.

అచ్చం చర్మం (సాసేజ్ స్కిన్)లాగే ఉంటుందని, ఈ గొట్టాన్ని సన్నని ప్లాస్టిక్‌తో తయారుచేశామని చెప్పారు. ఈ గొట్టాన్ని నోటి ద్వారా జీర్ణాశయం తర్వాతి భాగమైన ఆంత్రమూలంలోకి ప్రవేశపెడతామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మత్తుమందు ఇచ్చి గంటలో పూర్తి చేస్తారని డైలీమెయిల్ తెలింది.

ఇది ఆంత్రమూలం గోడలకు అతుక్కొని ఉండి జీర్ణమైన ఆహారాన్ని తక్కువగా పీల్చుకునే విధంగా చేస్తాయని, తద్వారా రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుముఖం పడతాయని శాస్త్రవేత్తలు అన్నారు. ఎండోబారియర్‌ను వాడిన 72 శాతం మందిలో మధుమేహం పూర్తిగా తగ్గిపోయిందని వారు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu