Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియో గుడ్ న్యూస్ : 4జీ ఫీచర్ ఫోన్ సెకండ్ సేల్

దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. జియో విక్రయిస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ రెండో విడత విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రటించింది.

జియో గుడ్ న్యూస్ : 4జీ ఫీచర్ ఫోన్ సెకండ్ సేల్
, సోమవారం, 27 నవంబరు 2017 (20:21 IST)
దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. జియో విక్రయిస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ రెండో విడత విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రటించింది.
 
తాజాగా జియో ఫోన్ కొనుగోలుకు ఆసక్తి చూపించిన వారికి మెసేజ్‌లు పంపించేందుకు జియో రంగం సిద్ధం చేసింది. ఆ లింక్ క్లిక్ చేసిన వినియోగదారులకు తమ దగ్గర్లోని ఔట్‌లెట్‌కు సంబంధించిన సమాచారం వస్తుంది. అక్కడికి వెళ్లి జియో ఫోన్‌ను తీసుకోవచ్చు.
 
నిజానికి ఈ సంస్థ ప్రవేశపెట్టిన ఈ ఫోన్లకు భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడిన విషయంతెల్సిందే. దీంతో ఫోన్ల బుకింగ్‌ను నిలిపివేసింది. అదేసమయంలో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ అనుకున్న గడువులోనే ఫీచర్ ఫోన్లను సరఫరా చేసింది. ఇపుడు రెండో విడత ఫోన్ బుక్కింగ్స్‌ను ప్రారంభించింది. 
 
ప్రస్తుతం జియో ఫోన్‌కు ఇతర టెల్కోల నుంచి విపరీతమైన పోటీ నెలకొనివున్న విషయం తెల్సిందే. జియో ఫోన్‌కు చెల్లిస్తున్న మొత్తానికి కాస్త అటూఇటుగా అదే ధరతో 4జీ స్మార్ట్‌ఫోన్లను ఇతర కంపెనీలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా, ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మేకర్ కార్బన్‌తో కలిసి రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది. అలాగే, మరో టెల్కో వొడాఫోన్.. మైక్రోమ్యాక్స్‌తో చేతులు కలిపి రూ.999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, ఐడియాతో పాటు.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా చౌకధరకే ఫోన్ అందిచనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూజిలాండ్‌కు పెను సునామీల ముప్పు .. తప్పించుకునేందుకు 7 నిమిషాలేట (వీడియో)