Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా మారనున్న ఫ్లిఫ్ కార్ట్ సీఈవో.. ఐఫోన్ 7దే అగ్రస్థానం..

రిలయన్స్ జియో ప్రభావంతో 4జీ మొబైళ్ల అమ్మకం జోరందుకుంది. 4జీ సేవలను మూడు మాసాలు జియో ఉచితంగా ప్రకటించడంతో వినియోగదారులు 4జీ మొబైళ్లను పోటాపోటీగా కొనేస్తున్నారు. ఈ మొబైళ్ల కొనుగోలు అత్యధిక శాతం ఆన్‌లైన్

Advertiesment
iPhone 7
, శుక్రవారం, 7 అక్టోబరు 2016 (16:37 IST)
రిలయన్స్ జియో ప్రభావంతో 4జీ మొబైళ్ల అమ్మకం జోరందుకుంది. 4జీ సేవలను మూడు మాసాలు జియో ఉచితంగా ప్రకటించడంతో వినియోగదారులు 4జీ మొబైళ్లను పోటాపోటీగా కొనేస్తున్నారు. ఈ మొబైళ్ల కొనుగోలు అత్యధిక శాతం ఆన్‌లైన్‌లో జరుగుతోంది. దీంతో భారత్‌లోని ఈ-కామర్స్ దిగ్గజాల్లో పోటీ పెరిగిపోతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 
 
ఇలా ఈ-కామర్స్ మొబైళ్ల విక్రయంలో ఫ్లిప్ కార్ట్ ముందుంది. ఈ పండుగ సీజన్‌లో ఫ్లిఫ్ కార్ట్ అమ్మకాల్లో ఐఫోన్ 7 మోడలే అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్ ఐఫోన్ 7 అమ్మకాలను పెంచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా మారబోతున్నారు. 
 
శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఫ్లిప్‌కార్ట్ సీఈవో డోర్ డెలివరీ ద్వారా సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లా వెళ్లి ఫస్ట్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఐఫోన్ 7ను అందించనున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ కొన్నవారికి ఫ్లిప్‌కార్ట్ సర్‌ప్రైజ్ కూడా ఇవ్వనుందట. అమ్మకాలు పెంచుకోవడానికి, వినియోగదారులను ఆకర్షించడానికి ఫ్లిప్‌కార్ట్ ఈ డోర్ డెలివరీ స్ట్రాటజీని అమలు చేస్తోందని ఐటీ నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2018 డిసెంబర్ నాటికి భారత్-పాక్ సరిహద్దు షట్టర్ క్లోజ్.. షరీఫ్ తేనేటి విందులో?