Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో లాక్‌డౌన్ : కాలపరిమితిని పొడగించిన టెల్కో కంపెనీలు

Advertiesment
Airtel
, ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (12:18 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. దీంతో మొబైల్ వినియోగదారులకు ఊరట కల్పించేలా నాలుగు టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు బీఎస్ఎన్ఎల్ కంపెనీలు మంచి నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 16వ తేదీతో వ్యాలిడిటీ ముగిసిన ప్రీపెయిడ్ నంబర్లన్నిటికీ మే మూడో తేదీ వరకు వ్యాలిడిటీని పొడగించింది. 
 
లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని వారి ప్యాక్‌ల చెల్లుబాటు గడువు (వ్యాలిడిటీ పీరియడ్‌)ను పొడిగించాయి. లాక్‌డౌన్‌ ముగిసే వరకు తమ వినియోగదారులకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను అందజేస్తామని రిలయన్స్‌ జియో ప్రకటించింది. దీనివల్ల కేవలం అల్పాదాయ వినియోగదారులకే కాకుండా ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్లాన్లను రీచార్జిచేసుకోలేకపోతున్న వారందరికీ లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. 
 
ఇదేవిధంగా తమ నెట్‌వర్క్‌ల పరిధిలోని దాదాపు 12 కోట్ల మంది అల్పాదాయ వినియోగదారుల ప్రస్తుత ప్లాన్ల గడువును వచ్చేనెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వెల్లడించాయి. మరోవైపు ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ ఎల్‌ తమ ఖాతాదారులకు మే 5 వరకు ఇన్‌కంమింగ్‌ కాల్స్‌ సౌకర్యాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్వారంటైన్‌లో కరోన్ బాధితుడు ఆత్మహత్యాయత్నం