Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విమానం ఇంజిన్‌‍లో పడి ఓ వర్కర్ దుర్మరణం.. ఎక్కడ?

deltaairlines
, మంగళవారం, 27 జూన్ 2023 (09:51 IST)
అమెరికాలో ఓ విషాదకర ఘటన జరిగింది. విమానం ఇంజిన్‌‍లో పడి ఓ వర్కర్ దుర్మరణం పాలయ్యాడు. టెక్సాస్‌లోని శాన్ యాంటోనియో విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు (ఎన్.టీ.ఎస్.బీ) వెల్లడించిన వివరాల మేరకు.. లాస్ ఏంజిల్స్ నుంచి టెక్సాక్‌కు వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం అరైవల్ గేటు వద్దకు చేరుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
అప్పటికి విమానంలోని ఒక ఇంజిన్ ఆన్‌లోనే వుంది. ఈ క్రమంలో ఇంజిన్, గాలితోపాటు వర్కర్‌ను కూడా లోపలికి పీల్చేసుకుంది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేశింది. తమ గుండె పగిలిందని వ్యాఖ్యానించింది. 
 
మృతుడు యూనిఫీ అనే సంస్థలో పని చేస్తున్నాడు.ఈ సంస్థ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్‌కు సంబంధించిన పనులు చేస్తుంది. అయితే, ఈ ప్రమాదానికి యూనిఫీ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఎస్బీ వెల్లడించింది. ఘటన జరిగిన సమయంలో భద్రతపరమైన నిబంధనలు ఉల్లంఘన జరగలేదని పేర్కొంది. 
 
కొండలు - గుట్టలకు గుండు కొట్టేస్తున్నారు.. ఎక్కడ?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపాకు చెందిన మట్టి మాఫియా రెచ్చిపోతోందని రాష్ట్ర ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా కొండలు, గుట్టలకు గుండు కొట్టేస్తూ అరాచకానికి పాల్పడుతున్నారంటూ వారు మండిపడుతున్నారు. ఈ అరాచకం అటు విశాఖ నుంచి ఇటు అనంతపురం వరకు సాగుతోందని, ఈ క్రమంలో వారి కంటికి కనిపించే ఏ కొండనూ వైకాపా నాయకులు వదలిపెట్టడం లేదంటున్నారు. 
 
దీనికి తాజా ఉదాహరణే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోవడమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి తవ్వేస్తున్నారు. పొక్లెయిన్లతో అడ్డగోలుగా తవ్వడంతో కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి పరిధిలోని గుట్టను తవ్వి ఎర్రమట్టిని కొల్లగొడుతున్నారు. 
 
స్థానిక వైకాపా నాయకుడొకరు పొక్లెయిన్లతో మట్టిని తవ్వి రోజూ వందలాది టిప్పర్లతో ప్రైవేట్‌ లేఅవుట్లకు విక్రయిస్తున్నారు. విచ్చలవిడి తవ్వకాలతో కొద్దిరోజులకే గుట్ట కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఆ నాయకుడు ఇంతటితో ఆగలేదు.. మట్టి తరలించగా చదునైన ప్రాంతంలో మామిడి చెట్లు పెంచినట్లు రికార్డులో చూపి ఉపాధి నిధులు కాజేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో రెచ్చిపోతున్న వైకాపా మట్టి మాఫియా.. కొండలు - గుట్టలకు గుండు కొట్టేస్తున్నారు..