Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యుద్ధం భారత్ పైన కాదు... టెర్రరిస్టులపైన... ఏరివేయండి: నవాజ్ షరీఫ్, పాక్ సైన్యం షాక్

పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం ఆయన ప్రభుత్వాన్ని ఏం చేస్తుందో తెలియదు కానీ, ఆయన సర్కారు ఆదేశాలు మాత్రం పాకిస్తాన్ సైన్యానికి మింగుడుపడటంలేదు. వదిలితే భారతదేశంపై యుద్ధం చేసి తమ సత్తా చూపిస్తాం అంటూ ఉవ్విళ్లూరుతున్న పాకిస్తాన్ సై

Advertiesment
Pak Terrorists shock
, గురువారం, 6 అక్టోబరు 2016 (13:50 IST)
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం ఆయన ప్రభుత్వాన్ని ఏం చేస్తుందో తెలియదు కానీ, ఆయన సర్కారు ఆదేశాలు మాత్రం పాకిస్తాన్ సైన్యానికి మింగుడుపడటంలేదు. వదిలితే భారతదేశంపై యుద్ధం చేసి తమ సత్తా చూపిస్తాం అంటూ ఉవ్విళ్లూరుతున్న పాకిస్తాన్ సైన్యానికి నవాజ్ షరీఫ్ వీపుపై చరిచినట్లు ఓ ఆదేశం ఇచ్చారు. యుద్ధం చేయాల్సింది భారతదేశం పైన కాదనీ, దేశంలో ఉన్న ఉగ్రవాదులపైన అని, కనుక తక్షణమే దేశంలో ఉన్న ఉగ్రవాదులను ఏరివేయాలంటూ ఆయన సర్కారు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు డాన్ పత్రికలో వార్త ప్రచురించింది.
 
యూరి ఘటన నేపధ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో దేశంలో పాతుకుపోయి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న జైష్-ఎ-మహ్మద్ గ్రూపుతో సహా ఇతర మిలిటెంట్ గ్రూపులన్నిటినీ నాశనం చేయాలని నవాజ్ షరీఫ్ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తనకు మద్దతునిస్తున్న చైనా సైతం ఉగ్రవాదులు పేట్రేగిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీనితో పాకిస్తాన్ దేశానికి టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవడం మినహా మరో మార్గం లేకుండాపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి ఇష్టం లేక... చేతిని కోసుకుని కిడ్నాప్, రేప్ నాటకమాడిన యువతి.. విచారణలో గుట్టురట్టు