Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో లేటెస్ట్ ట్రెండ్ : కీచైన్లుగా బతికున్న తాబేళ్లు!

Advertiesment
చైనాలో లేటెస్ట్ ట్రెండ్ : కీచైన్లుగా బతికున్న తాబేళ్లు!
, సోమవారం, 10 ఆగస్టు 2015 (13:29 IST)
చైనాలో ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్ నడుస్తోంది. చైనాలో దాదాపు నెల రోజుల పాటు జరిగే కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా బతికున్న తాబేళ్లను కీచైన్లుగా విక్రయిస్తున్న సంస్కృతి పెరిగింది. వీటిని సొంతం చేసుకునేందుకు, దగ్గరి బంధువులకు, మిత్రులకు బహుమతిగా ఇచ్చేందుకు ప్రజలు కొంటున్నారు. వీటిని దగ్గరుంచుకుంటే అదృష్టం కలిసివస్తుందని భావిస్తున్నారు. 
 
చిన్న చిన్న తాబేళ్లను సీల్ చేసిన ఓ ప్లాస్టిక్ కవర్లో ఉంచి, అందులో విటమిన్లతో కూడిన నీటిని, అవి తినగలిగే చిన్ని జీవులను ఉంచి వాటిని కీచైన్లుగా విక్రయిస్తున్నారు. వీటిని పలువురు లక్ష్మీ కటాక్షం కోసం కొనుగోలు చేస్తుంటే, మరికొందరు వాటిని కొని స్వేచ్ఛ కల్పిస్తున్నారు. చైనా నుంచి పలు వస్తువులు ఇండియాకు స్మగ్లింగ్ అయ్యే ఈ రోజుల్లో తాబేలు కీచైన్లు త్వరలో భారత్‌లో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

Share this Story:

Follow Webdunia telugu