Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'భారత్‌తో అణుయుద్ధం తప్పదు' : హిజ్బుల్ ముజాదీన్ నేత

తమకు శత్రుదేశంగా ఉన్న భారత్‌తో అణు యుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిదీన్ నేత సయీద్ సలాహుదీన్ అంటున్నారు. ముఖ్యంగా కాశ్మీర్ అంశంపైనే ఈ యుద్ధం జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు.

Advertiesment
Hizbul Leader Sayeed Salahudeen
, సోమవారం, 8 ఆగస్టు 2016 (09:31 IST)
తమకు శత్రుదేశంగా ఉన్న భారత్‌తో అణు యుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిదీన్ నేత సయీద్ సలాహుదీన్ అంటున్నారు. ముఖ్యంగా కాశ్మీర్ అంశంపైనే ఈ యుద్ధం జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... కాశ్మీర్ పోరాటానికి అన్నివిధాల మద్దతు ఇవాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పై ఉందని, పాకిస్థాన్ అండగా నిలిస్తే రెండు దేశాల మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశముందన్నారు. కాశ్మీర్ ప్రజలు రాజీ పడడానికి సిద్ధంగా లేరని, నాలుగో ప్రపంచ యుద్ధం రానుందని జోస్యం చెప్పారు.
 
పాకిస్థాన్‌కు ప్రపంచం యావత్ మద్దతు ఇవ్వకపోయినా, ఐక్యరాజ్య సమితి తన కర్తవ్యం నిర్వహించకపోయినా కాశ్మీర్ ప్రజలు తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలని సలాహుదీన్ పిలుపునిచ్చారు. సాయుధ యుద్ధం చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదని కాశ్మీర్ ప్రజలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజన్‌ దైవదూత.. నేను దెయ్యాన్నా? మీడియా ఆకాశానికెత్తేస్తోంది : స్వామి ఫైర్