Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

Advertiesment
joe- trump

ఠాగూర్

, ఆదివారం, 1 జూన్ 2025 (15:30 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ గురించి ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్ ఒకటి శనివారం రాత్రి తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను 2020లో ఉరితీశారని, ప్రస్తుతం ఉన్నది జో బైడెన్ క్లోన్ అని పేర్కొంటూ, ఈ కుట్ర థియరీని ఆయన బహిర్గతం చేశారు. 
 
డోనాల్డ్ ట్రంప్ శనివారం చేసిన ఆసక్తికర ట్వీట్‌లో జో బైడెన్‌ను ఆయన పూర్వీకులు గత 2020లో ఉరితీశారు అని పేర్కొన్నారు. 78 ఏళ్ల ట్రంప్.. దీనికి ఎలాంటి ఆధారం, వివరణ లేకుండా లింక్‌ను పోస్ట్ చేశారు. అలాగే, డోనాల్డ్ ట్రంప్ అనుచరులు షేర్ చేసిన పోస్ట్‌లో కూడా జో బైడెన్‌ లేరు.. 2020లో ఉరితీశారు. బైడెన్ రెండు క్లోన్స్. వాటిలో ఒకటి రోబోటింగ్ ఇంజనీరింగ్ చేసిన అత్మలేని బుద్ధిహీన బైడెన్ అని ఈ విషయం డెమొక్రాట్లకు తెలియదని పేర్కొన్నారు.
 
జో బైడెన్ గురించి ప్రజలు 'చెడుగా భావించకూడదు' అని చెప్పిన ఒక రోజు తర్వాత ట్రంప్ పోస్ట్ చేయడం గమనార్హం. డెమొక్రాట్ 'కొంతవరకు దుర్మార్గుడు' అని కూడా అన్నారు. "మీరు అతని పట్ల జాలిపడితే, అతని పట్ల జాలిపడకండి, ఎందుకంటే అతను దుర్మార్గుడు." అని పేర్కొన్నారు. 
 
బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. తన జీవితకాలంలో ఒక రకమైన మితవాద వ్యక్తి. తెలివైన వ్యక్తి కాదు, కానీ కొంత దుర్మార్గుడు అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. మీరు అతని పట్ల జాలిపడితే, అంతగా జాలిపడకండి, ఎందుకంటే అతను దుర్మార్గుడు అని పేర్కొన్నారు. ఇదిలావుంటే, శుక్రవారం తన రోగ నిర్ధారణ తర్వాత మాజీ అధ్యక్షుడు బైడెన్ తొలిసారి వ్యాఖ్యలు చేశారు. స్మారక దినోత్సవ కార్యక్రమం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, 82 ఏళ్ల వృద్ధుడు తాను ఇప్పటికే చికిత్స పొందుతున్నానని, దీన్ని అధిగమిస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు