Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత ఐటీ రంగానికి పెద్ద దెబ్బ.. 2022 నాటికి 7లక్షల ఉద్యోగాలు గోవిందా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవుట్ సోర్సింగ్‌పై వేటు వేయడంతో పాటు వీసాలపై కొరడా ఝుళిపించడంతో భారత ఐటీ నిపుణులకు కష్టాలు తప్పట్లేదు. తాజాగా హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన పరిశోధనలో 2021 నా

Advertiesment
Seven lakh
, బుధవారం, 6 సెప్టెంబరు 2017 (18:37 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవుట్ సోర్సింగ్‌పై వేటు వేయడంతో పాటు వీసాలపై కొరడా ఝుళిపించడంతో భారత ఐటీ నిపుణులకు కష్టాలు తప్పట్లేదు. తాజాగా హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన పరిశోధనలో 2021 నాటికి 6.4 లక్షల ఐటీ ఉద్యోగులు తమ కొలువు కోల్పోతారని అంచనా వేసింది. దీంతో ఐటీ నిపుణుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీనికి రోబోటిక్ ప్రోసెస్ ఆటోమేషన్ కారణమని సదరు సంస్థ తన పరిశోధనలో వెల్లడించింది. 
 
అమెరికా కేంద్రంగా పనిచేసే హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఉద్యోగాన్ని కోల్పోతారని పేర్కొంది. అయితే ఉన్నత, మధ్య స్థాయి ఉద్యోగులు లక్ష నుంచి 1.9లక్షలకు పెరిగే అవకాశం ఉందని సంస్థ పేర్కొన్నారు. 
 
ఆటోమేషన్ వల్ల ఉన్నత స్థాయి నైపుణ్యాల ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపింది. ఈ క్రమంలో అంచనాలు సవరిస్తే.. 2022 నాటికి ఏడు లక్షల ఉద్యోగాలు ఊడుతాయని సంస్థ షాక్ ఇచ్చింది. లోస్కిల్స్ కారణంగా ఐటీ ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఎక్కువగా వుందని సంస్థ ఆ ప్రకటనలో పేర్కొంది.
 
ఆటోమేషన్‌పై ఖర్చూ చేస్తే మ్యాన్ పవర్ తగ్గించేందుకు ఐటీ సంస్థలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో కంపెనీలు కోతలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆటోమేషన్ ఎఫెక్ట్ మొదలైంది. హైదరాబాదులో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు తగ్గాయి. 
 
ఖర్చు తగ్గించుకునే దిశగా ఐటీ సంస్థలు తీసుకున్న నిర్ణయాల ద్వారా ఎంట్రీ లెవల్‌పై తీవ్ర ప్రభావం పడింది. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలో ఇప్పటికే ఆటోమేషన్ ట్రైనింగ్ ప్రారంభమైంది. దీంతో హైదరాబాదుతో పాటు భారతీయ ఐటీకి కష్టాలు తప్పవని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య... నిజం రాస్తే పాయింట్ బ్లాంక్ మర్డర్లే...