శ్రీ రామనవమి రోజున రాముని సందేశం పాటించండి
రాముని జన్మదినంరోజున ఆయన ఆదర్శాన్నికూడా ఆపాదించండి
భారత దేశం పండుగల దేశం. మన దినచర్యలలోనే పండుగలున్నాయి. అలాంటిదే శ్రీరామనవమి. రాక్షసులను సంహరించడానికి విష్ణుభగవానుడు రాముని రూపంలో అవతరించాడు. తను మర్యాదా పూర్వకమైన జీవితాన్ని గడిపి పురుషోత్తముడైనాడు. నేటికీ పురుషోత్తముని జన్మదినం చాలా ఘనంగా జరుపుకుంటుంటారు. కాని ఆయన పాటించిన ఆదర్శాలను మాత్రం ఎవ్వరూకూడా పాటించడంలేదు.
అయోధ్యకు రాజకుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు తన తండ్రి మాటను జవదాటకుండా తన రాజవైభోగాన్ని త్యజించి(వదిలి) 14సంవత్సరాలు వనవాసం చేసిన మహాత్యాగశీలి ఆయన. కాని నేడు ఇలాంటి కుమారులు ఎంతమంది ఉన్నారు. తమ వైభవాలను వదులుకునేందుకు ఇష్టపడని ప్రభృతులు చివరికి తమ తల్లిదండ్రులను కాల్చుకు తింటున్నారు.
మన దేశంలో శ్రీరామ నవమి, శ్రీకృష్ణ జన్మాష్టమిని చాలా సంతోషకరమైన వాతావరణంలో జరుపుకుంటారు. కాని వారు చూపిన ఆదర్శాలు, సందేశాలనుమాత్రం పాటించడంలేదు. శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన గీతోపదేశం నేడు కేవలం ఓ పుస్తకంలా ఉండిపోయింది.
మహాకవి తులసీదాస్ రచించిన శ్రీరామచరిత మానస్లో భగవంతుడు శ్రీరాముని జీవిత చరిత్ర వర్ణిస్తూ...శ్రీరాముడు ఉదయం నిద్ర లేవగానే తన తల్లిదండ్రుల చరణాలకు నమస్కరించేవారు. కాని ప్రస్తుతం తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం కన్నాకూడా వారు చెప్పిన మాటలను ఎంతమంది పాటిస్తున్నారు...?
ప్రస్తుతం పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మహాపురుషుల చెప్పిన, చూపిన ఆదర్శాలు కేవలం టీవీలలో ధారావాహిక కార్యక్రమాలుగా, పుస్తకాలలో కథలలాగా ఉండిపోయాయి. మన దేశ నాయకులుకూడా తమ అధికారంకోసం శ్రీరామనామం జపిస్తుండటం గమనార్హం.
రామునిపేరుతో ఓట్లను దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప వారి ఆదర్శాలను పాటించడం లేదని పెద్దలు వాపోతున్నారు. నిజంగానే శ్రీరామున్ని ఆరాధించేవారైతే, రామరాజ్యం స్థాపించాలనుకుంటుంటే "జయ్ శ్రీరామ్" ను ఉచ్చరించే ముందు రాముని ఆదర్శాలను పాటించండి. ఆ తర్వాతే రామ రాజ్యం కోసం తాపత్రయపడండి. అధికారంకోసం ఆదర్శాలను తుంగలో తొక్కకండని అంటున్నారు సీనియర్ సిటిజన్స్.