వధూవరులు ధరించే వరమాల విశిష్టత ఏమిటి..?
, శుక్రవారం, 27 మే 2011 (18:28 IST)
"
వివాహాలు స్వర్గంలో నిర్ణయింపబడతాయి. వాటిని భూమిపై జరుపుకుంటారు." అన్న నానుడి మేరకు జైమాల లేదా వరమాల ఒక్కటయ్యే జంటకు తొలి అడుగు లాంటిది. పవిత్రమైన శుభకార్యంతో ఒకటవుతున్న వధూవరులు ఈ పవిత్ర కార్యానికి తమ మద్దతు వ్యక్తం చేస్తూ ఈ పూలదండలను మార్చుకుంటారు. పురాణాల్లో సీత, ద్రౌపది, పార్వతీదేవి వంటివారు తాము మెచ్చిన వారి మెడల్లో వరమాలలు వేశారు. అలనాటి ఆ వరమాల ఆచారం నేటి మన వివాహ ఘట్టాల్లో అత్యంత ముఖ్యమైనదిగా మారింది. తాళి కట్టడం వంటి ఆచారాలు లేనివారు దండలు మార్చుకోవడంతో పెళ్లి చేసుకుంటారు. వివాహఘట్టాలలో ఇదో కమనీయమైన ఆచారం. పూలదండలతో నిల్చున్న వధూవరులు భువిపై దిగిన సీతారాముల్లా, పార్వతీపరమేశ్వరుల్లా, విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల్లా కనిపిస్తారు. వారికో నిండుదనం, పరిపూర్ణత్వం ఈ దండల ధారణతో కనిపిస్తుంది.