Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారంలో ఐదు రోజులు పండ్లు, కూరగాయలు.. రెండుసార్లు చేపలు తీసుకోండి

వారంలో ఐదురోజుల పాటు పండ్లు, కూరగాయలు తీసుకోవాలని.. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్త

Advertiesment
fruits
, గురువారం, 8 జూన్ 2017 (15:20 IST)
వారంలో ఐదురోజుల పాటు పండ్లు, కూరగాయలు తీసుకోవాలని.. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి. కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు తినండి.
 
ఇక తాజా కూరగాయాల్లోనూ, పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుంటే.. చురుగ్గా ఉంటారు. పళ్లలో మెదడును రక్షించే యాంటీఅక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్రొకోలి, క్యాలీఫ్లవర్‌లలో ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. 
 
యాపిల్స్, గ్రేప్స్, ఆనియన్స్, టీ, డార్క్ చాక్‌లెట్‌లలో కూడా యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఆలివ్ఆయిల్, నట్స్, సన్‌ఫ్లవర్‌సీడ్స్, అవొకొడస్‌లో యాంటీ అక్సిడెంట్‌గా పనిచేసే ఇ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అల్జీమర్స్ వ్యాధికి బాగా పనిచేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎండలు తగ్గాయ్.. చిరుజల్లులు పడుతున్నాయ్.. ఫిట్‌గా ఉండాలంటే?