Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ చేస్తున్నారా?

Advertiesment
Vegetables
, శనివారం, 9 ఏప్రియల్ 2016 (09:36 IST)
కరెంట్ పోయిన తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ చేసి ఉంచిన ఆహారం తీసుకోవచ్చా.. అనే ప్రశ్నకు న్యూట్రీషన్లు ఏమంటున్నారంటే.. కూరగాయలు, పండ్లు, ఉడికించిన ఆహారాన్ని ఒక్క రోజు మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. అనేక రోజులు అలాగే ఉంచి వేడి చేసి తినడం అనారోగ్యానికి దారితీస్తుంది. 
 
అలాగే పవర్ కట్‌తో చల్లదనం కోల్పోయే ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా సులువుగా వ్యాపిస్తుంది. మళ్లీ పవర్ వచ్చినా ఆ ఆహారంలో నాణ్యత కోల్పోతుంది. ముఖ్యంగా మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచడాన్ని తగ్గించాలి. నాన్ వెజ్‌లో వచ్చే బ్యాక్టీరియాలు ఉదర సంబంధిత రోగాలకు దారి తీస్తుంది.
 
అలాగే కూరగాయల్ని కట్ చేసి అలానే ఉంచకుండా ఒక కవర్లో భద్రపరచి ఉంచడం మేలు. ఏ వస్తువునైనా ఒక రోజుకు పైగా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఇడ్లీ పిండి వారాల పాటు ఫ్రిజ్‌లో ఉంచకూడదు. 48 గంటల్లోపే ఉపయోగించండి. ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను వేడిచేసి మళ్లీ దానిని ఫ్రిజ్‌లో పెట్టకుండా చూసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu