Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విరేచనాలకు విరుగుడు చిట్కాలు: దానిమ్మ గింజల్ని మెత్తగా నూరి మజ్జిగలో..?

Advertiesment
Lemon
, సోమవారం, 28 డిశెంబరు 2015 (16:47 IST)
పేగుల్లో క్రిములు చేరినపుడు విరేచనాలు అవుతుంటాయి. రక్తంతో కూడిన విరేచనాలను రక్తాతిసారం అంటారు. వైద్యులు దీనినే "బాసిలరాడిసెంట్రీ" అంటారు. ఇక క్రిములతో కూడిన విరేచనాల్నిఆయుర్వేదంలో ప్రవాహిక అంటారు. ఆధునిక వైద్యులు అమీబిక్ డిసెంట్రీ అని అంటారు. ఈ రకం విరేచనాలు ప్రమాదకరమైనది. 
 
శ్లేష్మంతో కూడిన విరేచనాలు ముఖ్యంగా వేసవికాలంలోను, అధిక వేడిప్రాంతాల్లో జీవించే మనుషులకు ఎక్కువగా వస్తుంది. ఈ రకం విరేచనాల్లో కడుపునొప్పి ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత, బలహీనత ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం జరుగుతుంది. శ్లేష్మంతో కూడిన విరేచనాల్నిపట్టించుకోకపోతే లివర్ చెడిపోయే అవకాశం కూడా ఉంది. ఇలాంటి విరేచనాల్నిఅరకట్టడానికి ఈ చికిత్సలు పాటిస్తే సరిపోతుంది.
 
ఒక కప్పునీటిలో నిమ్మకాయ రసం కలిపి సన్నని మంటపై పది నిమిషాలు మరిగించి రోజుకు రెండు సార్లు త్రాగాలి. ఇలా చేస్తే విరేచనాలు తగ్గుతాయి. ఉల్లిపాయను సన్నగా తరిగి పెరుగుతో కలిపి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోవాలి.
 
ఒక టేబుల్ స్పూన్ మెంతులను పెరుగుతో నానబెట్టి తాగితే అన్నిరకాల విరేచనాలు తగ్గిపోతాయి. దానిమ్మ గింజల్ని మెత్తగా నూరి మజ్జిగలో కలిపి తాగించండి. విరేచనాలు త్వరగా తగ్గిపోతాయి. గసగసాలను మిక్సిలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చేయాలి. ఈ రసాన్నిపంచదారతో కలిపి తాగిస్తే విరేచానాలు తగ్గిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu