Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేపే రాఖీ పౌర్ణమి, సోదరి ఏం చేయాలో తెలుసా?

Advertiesment
Happy Raksha Bandhan 2021
, శనివారం, 21 ఆగస్టు 2021 (23:47 IST)
రేపే రాఖీ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటుస్నానం చేయాలి. ఆ తర్వాత రక్షారేకును పూజించాలి. అనంతరం సోదరి తన అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్న సమయంలో వారికి రాఖీ కట్టాలి. ఆ తర్వాత నోరు తీపి చేయడం సంప్రదాయం.
 
మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు, మధ్యాహ్నం వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటాయి. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని, ఆ సమయంలోనే రాఖీని కట్టించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక పెళ్లి అయిన ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలను కట్టడం సంప్రదాయం. 
 
పూర్వకాలంలో భర్తకి భార్య రక్షణ కోసం రాఖీని కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కడుతుంది. పురాణ కాలంలో రాజులు యుద్ధాలకువెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షను కట్టుకొని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు. రాఖీ పౌర్ణమీ రోజు కట్టే రక్షలో ఆసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం?