Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజినీకి ఐశ్వర్య కిడ్నీ దానం చేసిందా...?!!

Advertiesment
రజినీకాంత్
, సోమవారం, 20 జూన్ 2011 (13:50 IST)
WD
ఇప్పుడు తమిళ సినిమా పరిశ్రమలో ఇదే గోల. దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె తన తండ్రికి మూత్రపిండాన్ని దానం చేసిందన్న వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ వ్యవహారాన్ని మన దేశంలో చేస్తే అందరికీ తెలిసిపోతుంది కనుక ఆయనను సింగపూర్ తరలించి అక్కడే ఈ కిడ్నీ మార్పిడి చేశారని కోలీవుడ్ సినీ వర్గాల భోగట్టా. దీనికితోడు రజినీకాంత్ ఎంతకాలం ఆసుపత్రిలో ఉంటే ఐశ్వర్య కూడా అంతేకాలంపాటు ఆస్పత్రిలోనే ఉండటాన్ని వారు ఉటంకిస్తున్నారు.

ఐతే ఐశ్వర్య భర్త, యువహీరో ధనుష్ మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. మామయ్య రజినీకి ఎటువంటి కిడ్నీ మార్పిడి చికిత్స జరుగలేదనీ, అటువంటప్పుడు తన భార్య ఐశ్వర్య తన కిడ్నీని దానం చేసే ప్రశ్న ఇంకెక్కడుంటుందని చెపుతున్నాడు. ఏదైతేనేం రజినీ మునుపటిలా యాక్టివ్‌గా మారిపోడంపై ఆయన అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu