Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సత్యసాయి జిల్లాలో అత్తా కోడలిపై అఘాయిత్యం...

సత్యసాయి జిల్లాలో అత్తా కోడలిపై అఘాయిత్యం...

ఠాగూర్

, శనివారం, 12 అక్టోబరు 2024 (13:08 IST)
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడలిపై అఘాయిత్యం జరిగింది. శుక్రవారం రాత్రి ఐదుగురు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్‍మెన్‌గా ఉంటున్న అత్తా కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టిన గుర్తు తెలియని దుండగులు. 
 
మోటార్ సైకిల్‌లపై వచ్చిన ఐదు మంది.. రాత్రి సమయంలో సౌండ్ రావడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి టార్చ్ లైట్ వేసి గమనించి.. ఎందుకు ఇక్కడ ఉన్నారని అడిగినందుకు ఆ మహిళల భర్తలపై దాడికి దిగిన దుండగులు.. లోపల ఉన్న గదిలోకి నలుగురు వ్యక్తులు చొరబడి ఆ ఇద్దరి మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టి, అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఈ అఘాయిత్య ఘటన స్థానికంగా కలకలం సృష్టింస్తుంది. పొట్టచేతబట్టుకుని వలస వచ్చిన వారిపై ఇలా దారుణానికి ఒడిగట్టడం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమ్మె ఎఫెక్ట్ : 17 వేల ఉద్యోగులను తొలగించనున్న బోయింగ్ కంపెనీ