Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంగారెడ్డి జిల్లాలో కాల్పులు.. ఇద్దరు మృతి

Advertiesment
Ranga Reddy
, మంగళవారం, 1 మార్చి 2022 (14:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇబ్రహీంపట్టణంలోని కర్ణంగూడ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు దండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెదారు. మరో వ్యక్తి రాఘవేంద్ర రెడ్డి ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
కాగా, ఇటీవల పది ఎకరాల భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు కొనుగోలు చేశారు. అయితే, ఈ భూమి అప్పటికే మట్టారెడ్డి అనే వ్యక్తి కబ్జాలో ఉన్నట్టు సమాచారం. దీంతో భూమిని కొనుగోలు చేసిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు మట్టారెడ్డితో వాగ్వాదానికి దిగడంతో గుర్తు తెలియని దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే, ఈ కాల్పుల ఘటనపై ఇబ్రహీంపట్నం ఏసీపీ విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమినర్ మహేష్ భగవత్త పరిశీలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్ బాధితుల కోసం ఉచిత బస్సు సర్వీసులు