Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాహేతర సంబంధం: నిద్రిస్తున్న వ్యక్తిపై మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి చంపారు

వివాహేతర సంబంధం: నిద్రిస్తున్న వ్యక్తిపై మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి చంపారు
, శనివారం, 16 అక్టోబరు 2021 (12:08 IST)
వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపారు గుర్తుతెలియని దుండగులు. జగిత్యాలలో ఈ దారుణం వెలుగుచూసింది. 40 ఏళ్ల సింగరాజు గోపి శుక్రవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోతున్నాడు.


అతడు గాఢ నిద్రలో వున్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు దుండగులు. ఆ తర్వాత అతడిని దారుణంగా కత్తులతో పొడిచి చంపేసి పరారయ్యారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

 
మరో కేసులో... బీట్ బజార్ వద్ద గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని పొడిచి చంపారు. బాధితుడిని శేఖర్ (35) గా గుర్తించారు. దుండగులు శేఖర్‌పై కత్తులతో దారుణంగా దాడి చేశారని, అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని చెబుతున్నారు.

 
శేఖర్‌పై కూడా అంతకుముందు దుండగులు దాడి చేసినప్పటికీ తప్పించుకున్నట్లు తెలిసింది. హత్యకు పాత శత్రుత్వమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్షణ రంగంలో ప్రారంభమైన ఏడు కొత్త డిఫెన్స్‌ కంపెనీలు