Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సహజీవన భాగస్వామిని.. ఆమె ప్రియుడిని చంపేసిన హత్య.. కాకినాడలో జంట హత్యల కలకలం...

Advertiesment
murder

ఠాగూర్

, బుధవారం, 20 మార్చి 2024 (12:44 IST)
wకాకినాడలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. సహజీవన భాగస్వామితో పాటు.. ఆమె ప్రియుడిని ఓ వ్యక్తి చంపేశాడు. ఈ అక్రమ సంబంధాన్ని ప్రోత్సహించిందన్న కోపంతో వృద్దురాలైన మహిళ తల్లిపై కూడా దాడిశారు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చోబ్రోలు శివారులోజరిగింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
చేబ్రోలు గ్రామానికి చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు కత్తితో నరికి విచక్షణారహితంగా హత్య చేశాడు. అనంతరం లోవమ్మ తల్లి రామలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లోవమ్మ, లోక నాగబాబు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారని తెలిపారు. అయితే, ఇటీవల పోసిన శ్రీనుతో లోవమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది.
 
ఈ విషయం తెలియడంతో నాగబాబు కోపంతో ఊగిపోయాడు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని శ్రీను, లోవమ్మలపై కత్తితో పొడిచి చంపేశాడు. అక్రమ సంబంధానికి సహకరించిందనే ఉద్దేశంతో లోవమ్మ తల్లి రామలక్ష్మిపైనా నాగబాబు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రామలక్ష్మిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న లోవమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పోసిన శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏసీ భోగిలో ఎలుక.. ఎక్కడా చూసినా దుమ్మే.. ఎక్స్‌లో వీడియో