Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిస్బావుల్ అర్ధసెంచరీ: పాక్ 369/5

Advertiesment
మిస్బావుల్ అర్ధసెంచరీ పాక్ 369/5
, సోమవారం, 10 డిశెంబరు 2007 (17:40 IST)
బెంగుళూరులో పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మూడో రోజు ఆటలో మిస్బావుల్‌ అర్ధ సెంచరీ చేయడంతో పాక్ ఐదు వికెట్ల నష్టానికి 369 పరుగుల వద్ద తెర పడింది. ఇక్బాల్ అవుటవ్వడంతో కష్టాల్లో పడిన పాక్... అనంతరం మిస్బావుల్ కుదురైన ఆటతీరును కనబరచడంతో పాక్ ఇన్నింగ్స్‌లో తిరిగి నిలకడ కొనసాగింది.

దీంతో చివరి టెస్ట్ మూడో రోజు ఆటముగిసే సమయానికి పాక్ ఐదు వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది. మిస్బావుల్ (54), అక్మల్ (32)లు క్రీజులో కొనసాగుతున్నారు. ఓ వికెట్ నష్టానికి 86 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ కాసేపటికే సల్మాన్ భట్‌ను కోల్పోయింది.

అతను 68 పరుగుల వద్ద గంగూలీ బౌలింగ్‌లో వెనుదిరగగా, హర్భజన్ బౌలింగ్‌లో యూనిస్(80) పెవిలియన్ దారి పట్టాడు. నిలదొక్కుకుంటాడనుకున్న యూసఫ్(24) కూడా కాసేపటికే పఠాన్‌కు వికెట్ సమర్పించుకోగా, ఫైసల్ ఇక్బాల్ శర్మా వేసిన బంతిని డ్రైవ్ చేయబోయి గంభీర్ చేతికి చిక్కి వెనుదిరిగాడు..

గంగూలీ డబుల్ సెంచరీ.. యువరాజ్ (169), పటాన్(102) సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 626 పరుగులకు ఆలౌటయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu