టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ జట్టు తరపున ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నాడు. ధన్బాద్లో జరిగే సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్వంటీ-20 టోర్నీలో బెంగాల్ జట్టు పాల్గొంటుంది. ఈ టోర్నీకి బయలుదేరే ముందు ఆ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్లను ఆడనుంది.
ఈనెల 16, 18వ తేదీల్లో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లలో 18వ తేదీన జరిగే మ్యాచ్లో గంగూలీ పాల్గొంటారని బెంగాల్ సెలక్టర్స్ ఛైర్మన్ సంబారన్ బెనర్జీ తెలిపారు. గతంలో రంజీ ట్రోఫీ టోర్నీలో బెంగాల్ జట్టు తరపున ఈ ఎడం చేతి వాటం బ్యాట్స్మెన్ మైదానంలో దిగాడు.
అలాగే విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ తరపున గంగూలీ ప్రాతినిథ్యం వహించనున్నాడు. మార్చి 12 - 25 మధ్య కాలంలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ థర్డ్ ఎడియన్లో పాల్గొనే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు గంగూలీ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.