బిజీ షెడ్యూల్ను తగ్గించండని ఆస్ట్రేలియన్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ క్రికెట్ బోర్డులకు సూచించాడు. క్యాలెండర్ ఇయర్లో క్రికెట్ మ్యాచ్లు అధికమవుతున్నాయని వార్న్ అభిప్రాయపడ్డాడు. ఎడతెరిపి లేకుండా ఆడుతున్న వరుస ఆటలతో ఆటగాళ్లు అలసిపోతున్నారని పేర్కొన్నాడు.
ఈ క్రమంలోనే ఆటగాళ్లు గాయాలబారిన పడుతున్నారన్నాడు. ఇకనైనా అతి క్రికెట్ను ఆపాలని, క్రికెట్ క్యాలెండర్ను పూర్తిగా నింపకుండా ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరికేలా చూడాలని బోర్డులపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వనే్డలు, టి-20లు, టెస్టు మ్యాచ్లతో కిక్కిరిసిపోతోందని, ఆటగాళ్లకు విరామం అనేదే దొరకడం లేదని వార్న్ వ్యాఖ్యానించాడు.