Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌ జరుగుతున్న మాట నిజమే!: గిల్

Advertiesment
ఐపీఎల్
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్న మాట నిజమేనని డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒకవైపు ఐపీఎల్ టోర్నీ కొనసాగుతుండగానే క్రీడాకారులు మ్యాచ్ ఫిక్సింగ్‌పై చర్చించడం ఎంతో ఆశ్చర్యం కలిగిచిందని గిల్ అన్నాడు.

అయితే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు స్పష్టంగా తన దృష్టికి రాలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పాలంటే మీకు ఆధారాలు చూపాలి. అయితే నా వద్ద అటువంటి ఆధారాలేమీ లేవు. మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయంటూ చెలరేగిన ఊహాగానాలు, పుకార్ల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని గిల్ క్రిస్ట్ వెల్లడించాడు.

ఇంకా చెప్పాలంటే, ఐపీఎల్‌లో క్రీడాకారులను కలవడం మ్యాచ్ ఫిక్సర్లకు ఎంతో సులువైన పనిగా మారుతుందని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంకా ఐపీఎల్ టోర్నీ మ్యాచ్ ఫిక్సర్లకు ఎంతో సులువైన లక్ష్యంగా మారిందని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.

పటిష్టమైన నిఘాతోనే క్రికెట్‌లో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ‘ది డైలీ టెలిగ్రాఫ్’ పత్రికతో మాట్లాడుతూ గిల్‌క్రిస్ట్ అన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్న విషయం ఎంతో ఆందోళన కలిగించే విషయమని గిల్ చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu