Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ : సూర్యకుమార్ నేతృత్వంలో భారత జట్టు

surya kumar
, మంగళవారం, 21 నవంబరు 2023 (10:24 IST)
ఈ నెల 23వ తేదీ నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో భారత్ టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఇటీవల స్వదేశంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమి నుంచి భారత క్రికెటర్లు, అభిమానులు తేరుకోక ముందే ఈ రెండు జట్లు మరోమారు మైదానంలో తలపడనున్నాయి. ఈ నెల 23వ తేదీన తొలి టీ20 మ్యాచ్ వైజాగ్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత్ క్రికెట్ జట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా వెల్లడించింది. 
 
కాలి మడమ గాయం కారణంగా హార్దిక్ పాండ్య అందుబాటులో లేకపోవడంతో జట్టు పగ్గాలను సూర్యకుమార్ యాదవ్‌గు అప్పగించింది. జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రం శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌‍గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్ ఈ నెల 23వ తేదీన వైజాగ్ వేదికగా, చివరి మ్యాచ్ డిసెంబరు మూడో తేదీన బెంగుళూరు వేదికగా జరుగుతుంది. అలాగే, రెండో టీ20 మ్యాచ్ 26న తిరువనంతపురం, మూడో టీ20 మ్యాచ్ 28న గౌహతి, 4వ మ్యాచ్ డిసెంబరు ఒకటో తేదీన రాజ్‌కోట్ వేదికగా నిర్వహిస్తారు. 
 
భారత క్రికెట్ జట్టు వివరాలు :
 
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, అర్జీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిమ్మలను చూసి దేశం గర్విస్తుంది : రోహిత్ సేనకు కపిల్ దేవ్ ప్రశంస