Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగ్లాపై 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం... ఆదివారం పాకిస్తాన్‌తో ఫైనల్లో ఢీ

పులి-కుక్క బొమ్మలతో బంగ్లాదేశ్ లో చేసిన హంగామాను చీల్చి చెండాడింది టీమ్ ఇండియా. 265 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి చాంపియన్స్ ట్రోఫీ 2017 పోటీల్లో ఫైనల్‌కు చేరింది. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించి

Advertiesment
ChampionsTrophy 2017
, గురువారం, 15 జూన్ 2017 (22:40 IST)
పులి-కుక్క బొమ్మలతో బంగ్లాదేశ్ లో చేసిన హంగామాను చీల్చి చెండాడింది టీమ్ ఇండియా. 265 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి చాంపియన్స్ ట్రోఫీ 2017 పోటీల్లో ఫైనల్‌కు చేరింది. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించింది కోహ్లీ సేన. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 9 ఓవర్లు మిగిలి వుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 
 
శిఖర్ ధావన్ - రోహిత్ శర్మ దూకుడుగా ఆడి మొదటి వికెట్టుకు 87 పరుగులు జోడించారు. 15 ఓవర్లో శిఖర్ ధావన్ 46 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. మరోవైపు రోహిత్ శర్మ వికెట్ల వద్ద పాతుకుపోయాడు. వీరిద్దరూ కలిసి ఉతుకుడు కార్యక్రమం చేపట్టారు. 
 
రోహిత్ శర్మ 129 బంతుల్లో 15X4, 1X6 సాయంతో 123 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి 78 బంతుల్లో 13X4 సాయంతో 96 పరుగులు చేశాడు. దీనితో టీమ్ ఇండియా ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. ఆదివారం నాడు ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో ఫైనల్లో టీమిండియా ఆడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హమ్మయ్య... బంగ్లాను కట్టడి చేసిన కోహ్లి సేన... భారత్ లక్ష్యం 265 పరుగులు