Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ 19: మహారాష్ట్ర తర్వాత తమిళనాడే, ఎగబాకుతున్న కేసులు

Advertiesment
Covid 19
, గురువారం, 11 మార్చి 2021 (16:51 IST)
దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లోనే కరోనా కేసులు 80 శాతానికి పైగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ 8 రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో వుండగా తమిళనాడు రెండో స్థానంలో వుంది. ఆ తర్వాత పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా వున్నాయి. దేశంలో ప్రస్తుతం 1,89,226 క్రియాశీల COVID-19 కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య మొత్తం కేసులలో 1.68 శాతం.
 
ఇక పొరుగు రాష్ట్రం తమిళనాడు విషయానికి వస్తే...  బుధవారం నాడు 671 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 8,56,917కు కరోనా బాధితుల సంఖ్య చేరింది. కాగా నమోదైన 671 కేసుల్లో చెన్నై నగరంలోనే 275 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ నగరం మొత్తం 2,37,716కు చేరుకుంది.
 
రాష్ట్రంలో బుధవారం ఐదు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,530గా ఉంది. చికిత్స తరువాత బుధవారం నాడు మొత్తం 532 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 8,40,180కు చేరుకుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23 ఏళ్ల ప్రియుడి కోసం 41 ఏళ్ల వివాహిత తన భర్తను హత్య చేయమంది...