Publish Date: Sun, 12 Sep 2021 (14:39 IST)
Updated Date: Sun, 12 Sep 2021 (14:40 IST)
కరోనావైరస్. ఇప్పట్లో అది వదిలేదు కాదు కనుక దానిపట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నిదానిపై విద్యార్థి దశ నుంచి అప్రమత్తం చేయాల్సి వుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి 6వ తరగతి ఆపైన చదివే విద్యార్థులకు కరోనావైరస్ పాఠ్యాంశాన్ని సిలబస్ లో చేర్చనున్నారు. వైరస్ పైన విద్యార్థులకు అవగాహన వుంటే ఎలాంటి సమస్యలు వుండవు.
కరోనావైరస్ అంటే ఏమిటి? ఈ వైరస్ ఎలా సోకుతుంది. దాని లక్షణాలు ఎలా వుంటాయి, చికిత్స ఏమిటన్న విషయాలన్నీ పాఠ్యాంశంగా వుంటుందని అధికారులు వెల్లడించారు.