Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వే శాఖలో ఉద్యోగ జాతర.. 9970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Advertiesment
jobs

ఠాగూర్

, బుధవారం, 26 మార్చి 2025 (16:19 IST)
భారతీయ రైల్వే శాఖలో ఉద్యోగ జాతర మొదలైంది. ఏకంగా 9970 పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీఅయింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) అసిస్టెంట్ లోకో పైలెట్‌కు సంబంధించిన 9970 పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పోస్టుల కోసం ఏప్రిల్ 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీని మే 9గా నిర్ణయించారు. 
 
దరఖాస్తు చేసుకునేవారు ఆన్‌లైన్ ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు, ఈబీసీ అభ్యర్థులు రూ.250గా చెల్లించాల్సి ఉంటుంది. 
 
టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా గుర్తింపు పొందిన యూనవర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనిష్ట వయసు 18 నుంచి గరిష్ట వయసు 33 యేళ్లుగా ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి ఉంది. దివ్యాంగులకు, మాజీ సైనికోద్యోగులకు పదేళ్ల అదనపు సడలింపు ఉంది. 
 
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు అన్ని అలవెన్సులతో కలుపుకుని రూ.50 వేలకు పైగానే ఉండొచ్చని ఆర్ఆర్బీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?