Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏంటది?

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏంటది?
, సోమవారం, 5 అక్టోబరు 2020 (11:48 IST)
భారత రైల్వే శాఖ మరోసారి రైల్వే ప్రేమికులందరికీ అదిరిపోయే శుభవార్త అందించింది. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ రైల్వే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఉద్యోగం వ్యాపారం నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఎంతోమంది తమ స్వగ్రామాలకు పండగకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగి పోతూ ఉంటుంది. 
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లు.. పెరిగే ప్రయాణికుల రద్దీకి సరిపడే అవకాశం తక్కువగానే ఉంది అందుకే దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న భారత రైల్వే శాఖ రైల్వే ప్రయాణికులందరికీ శుభవార్త చెప్పింది. దసరా దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు భారత రైల్వే శాఖ తెలిపింది. 
 
కొత్తగా దేశవ్యాప్తంగా ఏకంగా 200 ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు అందరికీ అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా 17 రైళ్లను పట్టాలెక్కించి నడుపుతున్నట్లు తెలుస్తోంది. 
 
సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ నర్సాపూర్ విశాఖ చెన్నై బెంగళూరు తిరువనంతపురంకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలుస్తోంది. రైల్వే ప్రయాణికుల అందరికీ ఇది ఊరట కలిగించే వార్త అని చెప్పాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియాంకా కుర్తా పట్టుకుని లాగిన పోలీస్... తీవ్రంగా పరిగణిస్తూ సారీ చెప్పిన ఉన్నతాధికారులు!