Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినియోగదారులకు షాకిచ్చిన రిలయన్స్ జియో

Advertiesment
jio reliance

ఠాగూర్

, గురువారం, 30 జనవరి 2025 (14:13 IST)
రిలయన్స్ జియో మరోమారు వినియోగదారులకు తేరుకోలేని షాకిచ్చింది. తాజాగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించింది. వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొత్త ప్లాన్లను పరిచయం చేసిన జియో.. అదేసమయంలో పాత ప్లాన్లను తీసేసింది. ఇప్పటివరకు అందిస్తున్న రూ.189, రూ.479 రీఛార్జి ప్లాన్లను తన వెబ్‌సైట్‌ నుంచి పూర్తిగా తొలగించింది.
 
తక్కువ డేటా, ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రీఛార్జి ప్లాన్లు కావాలనుకొనే యూజర్ల కోసం జియో గతంలో రూ.189 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు అందించేది. 2జీబీ డేటా కూడా లభించేది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. దీంతో పాటు 84 రోజుల వ్యాలిడిటీతో రూ.479 ప్లాన్‌ అందుబాటులో ఉండేది. అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌, 1000 ఎస్సెమ్మెస్‌లు, 6జీబీ డేటా వంటి ప్రయోజనాలు లభించేవి. వాల్యూ ప్లాన్స్‌గా వీటిని వ్యవహరించేవారు.
 
ట్రాయ్‌ ఆదేశాలకు అనుగుణంగా రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్లను ఇటీవల జియో ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీతో రూ.458 ప్లాన్‌, 365 రోజుల వ్యాలిడిటీతో రూ.1958 ప్లాన్‌ తీసుకొచ్చింది. ఈ ప్లాన్లపై జియో టీవీ, సినిమా(నాన్‌- ప్రీమియం), క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయాలు జోడించింది. ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ట్రాయ్‌ పేర్కొన్న నేపథ్యంలో ఆ ప్రయోజనాలు అలాగే ఉంచుతూ ప్లాన్ల ధరల్ని తగ్గించింది. రూ.458 ప్లాన్‌ను రూ.448కు, రూ.1958 ప్లాన్‌ను రూ.1748కు తగ్గించింది. వాల్యూ ప్లాన్లను తొలగించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న తెలంగాణ భక్తుల బస్సుకి ప్రమాదం: ఒకరు మృతి