Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో కిసాన్ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసిన కేంద్రం

Advertiesment
రైతులు
, మంగళవారం, 17 నవంబరు 2009 (11:57 IST)
వ్యవసాయ సంబంధిత సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వీలుగా రైతుల కోసం కిసాన్ కాల్ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఫోన్ సౌకర్యం ద్వారా రైతులు తమకు వచ్చే వివిధ రకాల సందేహాలను వ్యవసాయ నిపుణులతో చర్చించి నివృత్తి చేసుకోవచ్చు.

పంటల సాగుబడి, విత్తన సమస్యలు, ఎరువులు, పురుగు మందుల వాడకం, ధాన్యం నిల్వ తదితర అంశాలపై రైతులు ప్రశ్నలు సంధించవచ్చు. ఇందుకోసం 1800 180 1551 అనే టోల్ ఫ్రీ నంబరుతో కూడిన టెలిఫోన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఫోన్‌కు రైతులు ఫోన్ చేస్తే తమ సమస్యకు సంబంధం ఉన్న నిపుణులు సమాధానం ఇస్తారు. కిసాన్ కాల్ సెంటర్ పేరుతో కేంద్ర వ్యవసాయ శాఖ దేశ వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కిసాన్ కాల్ సెంటర్లను కార్‌టెల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu