Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముల్తానీ మట్టి, కర్పూరంతో మొటిమలు పరార్....

Advertiesment
Multani matti
ముల్తానీ మట్టి, లవంగం నూనె, గంధం పొడిని పాత్రలో తీసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీనికి వేప ఆకుల పేస్టు కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రుద్దుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో కడిగేయాలి. రోజూ ఇలాచేస్తే మొటిమలు మాయమై, ముఖం కాంతివంతగా మారుతుంది. ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్, కర్పూరం మిశ్రమాన్ని ఫ్రిజ్‌ల్ ఉంచాలి. ఈ పేస్ట్ అప్లై చేస్తే ముఖం మీది మలినాలు తొలగి, తాజాగా కనిపిస్తుంది. 
 
కొన్ని న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తీసుకుని బాగా న‌లిపి ముఖంపై రాయాలి. కొంత సేప‌టి త‌రువాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. నిత్యం ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. శాండల్‌వుడ్ పౌడ‌ర్‌, ప‌సుపు, పాల‌ను కొద్ది మొత్తంలో తీసుకుని పేస్ట్‌లా త‌యారు చేసుకోవాలి. దీన్ని ముఖంపై రాసి కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖానికి మెరుపు వ‌స్తుంది.
 
కొద్దిగా తేనె, పాల‌పై మీగ‌డ‌ను తీసుకుని బాగా క‌లిపి ముఖంపై రాయాలి. అనంత‌రం కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖంపై ఉన్న చ‌ర్మం మృదుత్వాన్ని, కాంతిని సంత‌రించుకుంటుంది.  కొద్దిగా పాలు, ఉప్పు, నిమ్మ‌ర‌సంల‌ను తీసుకుని ముఖానికి రాసి కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖంపై ప‌డిన మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముక్కుపై నల్లటి మచ్చలు పోవాలంటే...?