బ్యూటీ టిప్స్: ఈ పండుగల వేళ మెరిసిపోండి
, సోమవారం, 12 సెప్టెంబరు 2011 (14:15 IST)
వరుస పండుగల సమయంలో మీరు మెరవాలి. అందంగా కనిపించాలి. అది సాధ్యం కావాలంటే.. ముందు చర్మసంరక్షణపై దృష్టి సారించాలి. అలాంటి సూచనలు కొన్ని మీకోసం...సహజ చర్మతత్వం కలవారు... అర చెంచా ముల్తానీ మట్టిలో అరచెంచా పాలపొడి, గులాబీ రేకలు మిశ్రమం, దానిమ్మ రసం చెంచా చొప్పున, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పూతలా వేయాలి. పది నిమిషాలయ్యాక కాచి చల్లార్చిన పాలల్లో దూదిని ముంచి ముఖంపై అద్దినట్లు చేయాలి. మర్దన చేస్తూ పూతను తొలగించుకుంటే సరి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
జిడ్డు చర్మతత్వం ఉన్నవారైతే..
సెనగపిండి, సోయాపిండి అరచెంచా చొప్పున, పావుచెంచా తులసి ఆకుల పొడి, చిటికెడు పసుపు, రెండు మూడుచెంచాల బత్తాయిరసం తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తరవాత కడిగిస్తే మార్పు ఉంటుంది. చర్మం తాజాగా మారుతుంది. ఇలా రోజుమార్చిరోజు చేయాలి.