ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత గోరువెచ్చటి నీటిలో క్లీంజర్ లేదా ఏదైనా ప్యూరిఫైయింగ్ జెల్ కలిపి ఆ మిశ్రమంతో ముఖాన్ని కడగండి. ఎప్పుడు కూడా మీరు సబ్బును వాడకండి. ఎందుకంటే సబ్బు వలన మీ ముఖంలోనున్న సహజసిద్ధమైన ఆయిల్ను పీల్చేస్తుంది. దీంతో చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఉంది.
ముఖాన్ని కడిగిన తర్వాత ఎల్లప్పుడు ఓ మెత్తటి తువాలుతో తుడవండి. ముఖాన్ని ఎక్కువగా రుద్దకండి. అలా చేస్తే చర్మంలో పగుళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది.
ఆ తర్వాత టోనింగ్ చేయండి. టోనింగ్తో మీ చర్మంలో దాగివున్న మురికి, మిగిలివున్న మేకప్ బయటకు వచ్చేస్తుంది. టోనర్తో మీ ముఖ చర్మం సాధారణ స్థితికి వస్తుంది. దీంతో ముఖవర్చస్సు పెరుగుతుంది.
ఆ తర్వాత చర్మంపై మాయిశ్చరైజర్ పూయండి. అది మీ చర్మానికి తగ్గట్టుండాలి. చర్మంపై మాయిశ్చరైజర్ చేయడం వలన మీ చర్మం సుతి మెత్తగాను, నునుపుగాను తయారవుతుంది. దీంతోపాటు చర్మంలోని సూక్ష్మరంద్రాలు, పొడిబారడం నుంచి కాపాడబడుతారు. మాయిశ్చరైజర్ చేసిన తర్వాత సన్స్క్రీన్ వాడొచ్చు.