అనాస పండుతో సహజసిద్ధ సౌందర్యం
* అనాస పండు (ఫైనాఫిల్)ని ఆహారంగా తీసుకోవటం అందరికీ తెలిసిందే. అయితే ఇదే అనాసకు అందచందాలను ఇనుమడింపజేసే శక్తి కూడా ఎక్కువగా ఉందని చాలా మందికి తెలియదు. అనాస పండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్దనా చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది.* అనాస పండు రసాన్ని ముఖానికి రాసి మర్దనా చేయటంవల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది. ఈ పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతేగాకుండా నల్లటి మచ్చలను సైతం ఇది తొలగిస్తుంది. క్యారెట్ రసం, అనాస రసాన్ని సమపాళ్లలో తీసుకుని ముఖానికి రాసుకుంటే, ప్రకాశవంతంగా తయారవుతుంది.* అనాసను ఫేస్ ఫ్యాక్గా కూడా వాడవచ్చు. బాదంపప్పుల పొడికి, ఒక టీస్పూన్ పాలు, ఒక టీస్పూన్ అనాస పండు రసం కలిపి తయారు చేసిన ముద్దను కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి అరగంటసేపు అలాగే ఉండి, గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే ముఖ చర్మం నిగనిగలాడుతుంది.