Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామన్వెల్త్ బ్యాడ్మింటన్: తుదిపోరులో సైనా నెహ్వాల్!

Advertiesment
సైనా నెహ్వాల్
FILE
న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ అమ్మాయి సైనా నెహ్వాల్ హవా కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

స్కాట్లాండ్ క్రీడాకారిణి సువాన్ ఈగిల్‌స్టాఫ్‌తో జరిగిన సెమీఫైనల్లో సైనా 21-10, 21-17తో విజయం సాధించింది. ఆద్యంతం గట్టిపోటీని ప్రదర్శించిన సైనా నెహ్వాల్ సెమీస్‌లో విజయం సాధించి స్వర్ణ పతక సాధనకు ఒక అడుగు దూరంలో నిలించింది.

అలాగే మహిళల డబుల్స్‌లో జ్వాల, అశ్విని జోడీ కూడా పతకం ఆశలు నిలుపుతూ స్వర్ణానికి అడుగుదూరంలో నిలిచింది. అయితే ప్రపంచ నెంబర్ వన్ లీ చాంగ్ వీతో జరిగిన మరో సెమీస్‌లో చేతన్ ఆనంద్ నిరాశ పరిచాడు.

Share this Story:

Follow Webdunia telugu