Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరమైన చిట్కాలు

Advertiesment
గర్భిణీ స్త్రీలు
ప్రతి గర్భిణీ మహిఆ సమయంలో తన ఆరోగ్యం గురించి తనే పట్టించుకోవాలి. కాస్త ఇబ్బంది తలెత్తినా వైద్యులను సంప్రదించాలి. మీ గర్భం సురక్షితంగా ఉన్నుప్పటికీ కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు వైద్యులు.

** గర్భం ధరించిన తొలి నెలలో కలకండ కలిపిన పాలను ప్రతిరోజూ రెండుపూటలా సేవించాలి.

** రెండవ నెలలో శతావరీ చూర్ణం ప్రతి రోజూ పది గ్రాములు నోట్లో వేసుకుని గోరువెచ్చని పాలను సేవించండి.

** మూడవ నెలలో పాలను చల్లబరచి ఒక చెంచా నెయ్యితోపాటు మూడు చెంచాల తేనెను కలిపి సేవించండి. ఇలా ఎనిమిది నెలలవరకు సేవిస్తుండాలి. నెయ్యి, తేనె సమపాళ్ళల్లో తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరమంటున్నారు వైద్యులు.

** నాలుగవ నెల పూర్తిగా పాలలో వెన్నను కలుపుకుని సేవించాలి.

** ఐదవ నెలలో మళ్ళీ పాలలో తగినంత నెయ్యి కలుపుకుని సేవించాలంటున్నారు వైద్యులు.

** ఆరు, ఏడవ నెలల్లో మళ్ళీ పాలలో శతావరీ చూర్ణం కలుపుకుని సేవించండి.

** ఎనిమిదవ నెలలో గోధుమ రవ్వను పాలలో కలుపుకుని సేవించాలి.

** మూడవ నెలనుంచి ఎనిమిదవ నెలవరకు రెండుపూటలా పాలలో ఆవు నెయ్యిని కలుపుకుని త్రాగాలి.

గర్భస్రావం: గర్భిణీస్త్రీలకు ఏడవ, ఎనిమిదవ నెలలో గర్భస్రావం జరిగే సూచనలుంటాయి. ఇలాంటి లక్షణాలు కనపడితే లోధ్రా, మర్రి జిగురుతో తయారుచేసిన చూర్ణం సమపాళ్ళల్లో తేనెతో కలిపి సేవించాలి. దీంతో ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు.

సూచన: పైన పేర్కొనబడిన చిట్కాలను విశ్లేషకులు సలహామేరకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. కాని ప్రతి గర్భిణీ స్త్రీకి వారి, వారి శారీరక స్థితి వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన చిట్కాలను పాటించేముందు వైద్యుల సలహాలుకూడా తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు వైద్యులు.

Share this Story:

Follow Webdunia telugu