Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"సమాచార హక్కు చట్టం"పై పీహెచ్‌డీ చేసిన తొలి మహిళ

Advertiesment
మహిళ
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన "సమాచార హక్కు చట్టం"పై హీహెచ్‌డీని సాధించిన తొలి మహిళగా... ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఓ మహిళ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

వివరాల్లోకి వస్తే... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, విడవలూరుకు చెందిన మడపర్తి సరోజనమ్మ అనే మహిళ సమాచార హక్కు చట్టంపై పీహెచ్‌డీ చేసిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఈ విషయాన్ని విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారు ప్రకటించినట్లు సరోజనమ్మ మీడియాకు వెల్లడించారు.

ఇదిలా ఉంటే... ఇప్పటిదాకా సమాచార హక్కు చట్టంపై పీహెచ్‌డీ చేసినవారు దేశంలోనే ఎవరూ లేరు. సరోజనమ్మ మొదటిసారిగా భారతదేశంలో ఈ చట్టంపై విమర్శనాత్మక పరిశోధనలు చేయడం ద్వారా పై గౌరవాన్ని సాధించగలిగారు. కాగా, ఈమె విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే ఎం.ఎల్. పూర్తిచేసి, అక్కడే అధ్యాపకురాలిగా స్థిరపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu