Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్త్రీలు ఏడిస్తే వెంటనే కన్నీరు వస్తాయి ఎందుకు?

Advertiesment
Women
ఆడవాళ్ళు ఏడిస్తే వెంటనే కళ్ళ వెంట నీళ్ళువస్తాయి. అందుకే మన పెద్దలు ఆడవాళ్ళ నేత్రాల్లో సముద్రాలున్నాయని అనేవారు. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చిన కళ్ళలో మొదట వచ్చేది కన్నీరే. ఆడవారు సున్నిత మనస్తత్వం కలవారు. చిన్నవిషయానికి కూడా ఆడవారు కన్నీరు పెట్టుకుంటారు. 
 
మగవారు సామాన్యంగా ఏడవరు. శాస్త్రాల పరంగా చూస్తే మగాళ్లు తరచుగా ఏడవకపోవడానికి కొన్ని సైకలాజికల్ కారణాలు కూడా ఉన్నాయి. ఆడవాళ్లకు ఎమోషన్స్ ముందుంటే మగాళ్లకు వెనకుంటాయి. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా సెంటిమెంట్లకు, భావోద్వేగాలకు గురవడం వారి హార్మోన్ల ప్రభావమే. స్త్రీలలో లెఫ్ట్‌ బ్రెయిన్‌కూ, రైట్ బ్రెయిన్‌కూ మధ్య సంబంధాలు ఉండడమే.
 
దీంతో లెఫ్ట్ (లాజిక్) రైట్ (ఎమోషన్స్) రెండింటి సమన్వయం స్త్రీలలో ఎక్కువుండటం వల్ల వారిలో భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయని నిపుణులు తేల్చి చెపుతున్నారు. అందుకే వారు సులువుగా ఏడుస్తారు. ఈ రెండింటి సమన్వయం పురుషుల్లో అంతవేగంగా, సులువుగా జరగకపోవడం వల్ల మగాళ్లు వెంటనే భావోద్వేగాలకు గురికారని మానసిక నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu