Publish Date: Mon, 04 Jan 2016 (12:16 IST)
Updated Date: Mon, 04 Jan 2016 (12:19 IST)
ఎండు మిరపకాయలను పట్టించేటప్పుడు ఆవనూనె చుక్కలు వేస్తే కారానికి మంచి రంగు వస్తుంది.
అల్లంని తడి గుడ్డలో చుట్టి నీళ్ళ కుండ పైన ఉంచితే వారం వరకూ తాజాగానే ఉంటుంది.
గ్యాస్ బర్నర్ని పెట్రోలుతో శుభ్రం చేస్తే నీలం మంటతో చక్కగా మండుతుంది.
నిమ్మకాయ ముక్కలు దంచిన ఉప్పులో ఉంచితే రెండు మూడు రోజులైనా చెడిపోకుండా ఉంటుంది.
దుంపలను ఉప్పు కలిపిన నీటిలో ఓ పావుగంట నానబెట్టి ఆ తర్వాత ఉడికించండి. త్వరగా ఉడుకుతాయి.
పుదీనా ఆకుల్నిఒక సీసాలో వేసి వంటింట్లో ఉంచితే ఈగలు రాకుండా ఉంటాయి.
బియ్యం ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే కొంచెం ఉప్పు పొడిని కలిపితే చాలు పురుగు పట్టదు.