Publish Date: Thu, 31 Mar 2016 (10:25 IST)
Updated Date: Thu, 31 Mar 2016 (10:44 IST)
నగలు, ఆభరణాలు ఎక్కువకాలం మన్నాలంటే.. వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. నగలను కొనేటప్పుడు వాటి ధర, నాణ్యత గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఆభరణాలకు మురికిపడితే పాలిష్ చేస్తే ఎక్కువ కాలం ఉంటుంది.
పాలిష్ కాకుండా రెండు చెంచాల సర్ఫ్పౌడర్ను ఒకగ్లాసు నీటిలో కరిగించి ఆ మిశ్రమంలో బంగారు నగలను ఒక రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే సన్నని బ్రష్తో శుభ్రపరుచుకోవాలి. ఆ తర్వాత ఆ నగలను కాటన్ వస్త్రంతో తుడిచిపెట్టుకోవాలి.
అలాగే ఇరవై గ్రాముల డిటర్జెంట్ని నీటిలో కరిగించి అందులో ఒక చెంచా అమ్మోనియా, రెండు చెంచాల మిథిలేటెడ్ స్పిరిట్ కలుపుకుని బాగా కలిపి చల్చార్చి భద్రపరుచుకోవాలి. అవసరమైనప్పుడు ఈ ద్రవంలో మంచి దూదిని ఉపయోగించి వెండి ఆభరణాలను శుభ్రపరుచుకోవచ్చు.
కుంకుడుకాయలను వేడినీటిలో నాననిచ్చి ఆ నీటిని వంపుకుని వేరుగా ఉంచుకోవాలి. వెండి ఆభరణాల్ని కుంకుడుకాయల్ని నానవేసుకున్న నీటిలో నాననివ్వాలి. నాలుగు గంటల తర్వాత ఆ నగలను తీసి బ్రెష్తో శుభ్రపరుచుకోవచ్చు.