Publish Date: Sun, 24 Aug 2025 (22:12 IST)
Updated Date: Sun, 24 Aug 2025 (22:16 IST)
గణేశుడికి ఇష్టమైన నైవేద్యాల్లో ముఖ్యమైనవి మోదకాలు, లడ్డూలు. గణేశుడిని మోదకప్రియ అని కూడా పిలుస్తారు, అంటే మోదకాలు అంటే చాలా ఇష్టమైనవాడు అని అర్థం. ఇవి కాకుండా ఆయనకు అనేక రకాల ప్రసాదాలు సమర్పిస్తారు.
మోదకాలను బియ్యం పిండితో తయారు చేసే కుడుములు, దీనిలో బెల్లం, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ కలిపి తయారు చేస్తారు. వీటిని ఆవిరి మీద ఉడికిస్తారు లేదా నూనెలో వేయిస్తారు.
గణేశుడికి చాలా రకాల లడ్డూలు సమర్పిస్తారు, ముఖ్యంగా శెనగపిండితో చేసిన లడ్డూలు, మోతీచూర్ లడ్డూ, కొబ్బరి లడ్డూలు. వినాయకునికి ఇష్టమైనవాటిలో ఉండ్రాళ్లు కూడా వున్నాయి. వీటిని బియ్యం పిండితో చిన్న ఉండలుగా చేసి ఆవిరి మీద ఉడికిస్తారు.
పులిహోర, పాయసంతో పాటు వివిధ ప్రాంతాల సంప్రదాయాలను బట్టి పురణ్ పోలి (మహారాష్ట్రలో), సుండల్ (తమిళనాడులో), వివిధ రకాల పండ్లు (ముఖ్యంగా అరటిపండు, కొబ్బరికాయ, దానిమ్మ) కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.
సిహెచ్
Publish Date: Sun, 24 Aug 2025 (22:12 IST)
Updated Date: Sun, 24 Aug 2025 (22:16 IST)