Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొజ్జ గణపయ్య లొట్టలేసుకుని తినే ఉండ్రాళ్లు, కుడుములు!

Advertiesment
ఉండ్రాళ్లు
FILE
బొజ్జ గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లంటే మహా ప్రీతి. తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఇక ఏ ఆటంకమూ రదని పురోహితులు చెబుతున్నారు. ఇంకేముంది..? మీరు కూడా ఉండ్రాళ్ళు తయారు చేసి బొజ్జ గణపయ్య లొట్టలేసుకుని తినేలా చేయండి.

ఉండ్రాళ్లకు కావలసిన పదార్థాలు :
బియ్యం పిండి: ఒక కప్పు
పాలు: ఒకకప్పు
నువ్వులు: అరకప్
పంచదార: ఒక కప్పు
కొబ్బరి తురుము: ఒక కప్పు
యాలకల పొడి: అర టేబుల్ స్పూన్
నీరు: రెండు కప్పులు
ఉప్పు: చిటికెడు

తయారీ విధానం:
ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్‌ను స్టౌ మీద పెట్టి అందులో రెండు నీటిని వేడి చేసుకోవాలి. నీరు వేడైన తర్వాత మెత్తగా కొట్టి పెట్టుకున్న బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. బియ్యం పిండిని ఉడికించుకునేటప్పుడు ఆవిరి బయటికి పోకుండా మూతపెట్టాలి. ఐదు నిమిషాలు ఉడికిన బియ్యం పిండిని స్టౌ మీద నుంచి కిందికి దించుకుని చిన్ని చిన్ని ఉండలుగా చేసుకోవాలి.

ఇంతలోపు మరో ప్యాన్‌ను స్టౌ మీద పెట్టి పంచదారలో తగినన్ని నీళ్ళు పోసి పాకం పట్టుకోవాలి. ఇందులో కొబ్బరి తురుము కూడా వేసి కొద్దిసేపు వేడిచేయాలి. తర్వాత బియ్యం పిండితో చేసిన చిన్ని ఉండలను పాకంలో వేసుకోవాలి. ఇందులో పాలు కూడా పోసి బియ్యం ఉండలకు పంచదార పాకం, పాలు పట్టేలా కొద్దిసేపు ఉడకనివ్వాలి

అలాగే నువ్వులను కొద్దిగా వేడిచేసి పొడిచేసుకోవాలి. ఈ పొడిని పాల ఉండల్లో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. చిక్కగా సిరప్‌లా తయారవుతుంది. చివరిగా యాలకుల పొడిని చల్లుకుని దించుకోవాలి. అంతే వినాయకుని భలే నచ్చే ఉండ్రాళ్లు రెడీ..!

గణపతికి నచ్చే కుడుములు ఎలా చేయాలంటే..!?

కావలసిన పదార్థాలు:
రవ్వలా కొట్టిన బియ్యపుపిండి - రెండు కప్పులు
శనగపప్పు - అర కప్పు
నెయ్యి- ఒక స్పూన్‌
ఉప్పు, నీళ్ళు - తగినంత

తయారీ విధానం:
ముందుగా రాత్రిపూటే బియ్యం నానబెట్టుకొని తెల్లారాక మిక్సీలో రవ్వలా వేసుకోవాలి. అలాగే శెనగలను 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి వేడయ్యాక, అందులో స్పూన్‌ నెయ్యి వేసి శనగపప్పును వేసి కొద్దిగా వేగనివ్వాలి. శనగపప్పు వేగాక వెంటనే నీళ్లు పోసి మరగనివ్వాలి.

అందులో తగిన ఉప్పు వేసి, ఆ తర్వాత బియ్యపుపిండిని వేసి ఉండలు లేకుండా కలియబెట్టుకోవాలి. వెంటనే మూతపెట్టి 4-5 నిమిషాలు ఉక్కిరిపట్టాలి. నీరంతా పిండి పీల్చేసుకున్నాక స్టౌ మీద నుంచి దించేసుకోవాలి. ఆ పిండితో నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలి. వీటిని ఇడ్లీప్లేట్లలో పెట్టి 25 నిమిషాలు ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే కుడుములు రెడీ..!.

Share this Story:

Follow Webdunia telugu