Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గణేష్ నిమజ్జనం... సముద్రంలో దిగితే చేపలు కరిచాయి... ఆస్పత్రిలో 60 మంది...

గణేష్ నిమజ్జనం... సముద్రంలో దిగితే చేపలు కరిచాయి... ఆస్పత్రిలో 60 మంది...
, శుక్రవారం, 13 సెప్టెంబరు 2013 (17:46 IST)
WD
గణేష్ నిమజ్జనం జోరుగా జరుగుతోంది. ఐతే ముంబైలోని గణేష్ భక్తులను మాత్రం బొజ్జ గణపయ్యను సముద్రంలో నిమజ్జనం చేద్దామని నీటిలో దిగితే సముద్రంలో ఉన్న రాకాసి చేపలు పళ్లతో పటపటా కొరికాయి. దీంతో తీవ్రంగా గాయపడిన భక్తులను ఆసుపత్రిలో చేర్చారు. చిత్రం ఏంటంటే... మొదటి రోజు కొందరు భక్తులు చేపలు కరిచి ఆసుపత్రిపాలయ్యారు.

చేపలు కొరికాయని తెలిసి మళ్లీ మరికొంతమంది భక్తులు అదే నీటిలో దిగారు. ఇంకేముంది ఈమారు రెట్టించిన ఉత్సాహంతో ఆ చేపలు గట్టిగా కాళ్లను కొరికాయట. ఈ దుర్ఘటనతో పోలీసులు అంధేరి సముద్రం ఒడ్డుకు ఎవ్వరినీ అనుమతించడం లేదు. అటుగా సముద్రం లోపలికి వెళ్లేవారిని కూడా వారిస్తున్నారు.

ఇకపోతే చేపలు కరిచిన వ్యక్తులకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. కాగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి అని పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu