పన్నీర్ సమోసా తయారు చేయడం తెలుసా?
, శనివారం, 5 అక్టోబరు 2013 (16:11 IST)
కావలసినవి పదార్థాలు : పనీర్ తురుము : 1 కప్పు,మైదా : 1 1/2 కప్పుఉల్లిపాయ తరుగు : అరకప్పుక్యాప్సికమ్ తరుగు : పావుకప్పుఅల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 చెంచాగరం మాసాలా : 1 చెంచాఉప్పు, నూనె : తగినంతతయారు చేయు విధానం : మైదా పిండిలో నీరు, కొద్దిగా నూనె, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కాసింత నూనె వేడిచేసి ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. వేగాక పనీర్ తురుము. ఉప్పు, గరం మసాలా వేసి వేయించాలి. తర్వాత కొద్దిగా నీరుపోసి, మూతపెట్టి ఉడికించాలి. మైదా పిండితో చపాతీలు చేసి, ఉడికించిన పనీర్ ముద్దను మధ్యలో ఉంచి, సమోసాల్లా ఒత్తుకుని నూనెలో వేయించాలి.