Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరకరలాడే సగ్గుబియ్యం వడియాలు తయారు చేయడం ఎలా?

Advertiesment
సగ్గుబియ్యం వడియాలు
, శనివారం, 15 జూన్ 2013 (17:50 IST)
File
FILE
కావాల్సిన పదార్థాలు :

సగ్గుబియ్యం : కప్పు
నీరు : 4 కప్పులు
పచ్చిమిర్చి : 4,
జీలకర్ర : కొద్దిగా
ఉప్పు : తగినంత
నువ్వు పప్పు : పావు కప్పు

తయారు చేయు విధానం : మందపాటి గిన్నలో నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచి, బాగా మరిగించాలి. సగ్గుబియ్యం పోసి స్టౌ మంట తగ్గించాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ సుమారు గంటసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. సగ్గుబియ్యం పూర్తిగా కరిగిపోయి, రంగులేకుండా అయితే అప్పుడు పూర్తిగా ఉడికినట్టు. పాత్రను కిందికి దించి, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, జీలకర్ర, నువ్వులు వేసి కలపాలి. చల్లారాక ఎండలో ప్లాస్టిక్ కవర్ మీద కావలసిన సైజులో వడియాలు పెట్టాలి. బాగా ఎండిన తరువాత వీటిని వేయించుకుని స్నాక్స్‌లా కాని, సాంబారు అన్నంలో కాని నంచుకుని తింటే బాగుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu