కొత్త అల్లుడొస్తే తయారు చేసే సీమపురి అట్టు!
సీమపురి అట్లను నెల్లూరు జిల్లాలో కొత్త అల్లుడు అత్తవారింటికి వచ్చినప్పుడు తయారుచేసి పెట్టే ఆచారం వుంది. అలాంటి సీమపురి అట్టును ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా...సీమపురి అట్లు ఉల్లికాడలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండు మిరపకాయలు, నిమ్మరసం జతకలిపి తయారు చేస్తారు. కావాల్సిన పదార్థాలు :పావు కిలో ఉల్లి పాయలు 15
గ్రాములు అల్లం, జీలకర్ర, కారం, నిమ్మ రసం, ఉప్పు పిండి కోసం.. 500
గ్రాములు బియ్యం 500
గ్రాములు ఉప్పుడు బియ్యం 200
గ్రాములు మినప్పప్పు 25
గ్రాములు శనగప్పు 10
గ్రాముల మెంతులు, ఉప్పు. తయారీ విధానం : పైన చెప్పిన పదార్థాలన్నింటిని నిమ్మరసం మినహా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. రెండు రకాల బియ్యం, శనగపప్పు, మినపపప్పు, మెంతులు కలిపి కనీసం ఐదారు గంటలపాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. పెనం వేడిచేసి కొంచెం మందంగా పిండిపరిచి దోసె సగం ఉడికాక టాపింగ్ పేస్టును పల్చగా పూయాలి. కొద్దిగా నెయ్యి వేసి రెండో వైపు తిప్పి దోరగా కాల్చుకోవాలి.